
కోడేరు, వెలుగు: ఒడిస్సా రాష్ట్రంలో అంతరించి పోతున్న నందు బోండా గిరిజన తెగకు చెందిన సంప్రదాయాలు, వేషధారణ, జీవనశైలిపై ఇటీవల హుస్సేన్ ఖాన్ స్మారక ఏడవ జాతీయ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన ఎస్ఎల్ స్టూడియో నిర్వాహకుడు అవగారి లింగం గోల్డ్ మెడల్ సాధించాడు. అవార్డు అందుకున్న ఆయనను ఫొటోగ్రాఫర్లు, సన్నిహితులు అభినందించారు.